Road Accident | నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్లు ఢీకొట్టుకోగా ఇద్దరు మృతి చెందారు. ఉయ్యాలవాడ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మృతులను బిజినేపల్లి మండలానికి చెందిన కాశన్న, శ్రీనివాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.