అయిజ /జోగులాంబ గద్వాల : దైవదర్శనానికి వెళ్తుండగా బొలెరో వాహనం(Bolero overturn) బోల్తాపడి(Road accident) ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన జోగులాంబ గద్వాల( Jogulamba district) జిల్లా అయిజ మండలం ఉత్తనూరు గ్రామ సమీపంలో శుక్రవారం చోటు చేసు కుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రం ఇడుపునూరు, మీర్జాపూర్ గ్రామాలకు చెందిన పలువురు బంధువుల తో కలిసి కర్నూలు జిల్లాలోని మద్దిలేటి స్వామి ఆలయ దర్శనానికి వెళ్తున్నారు.
ఈ క్రమంలో ఉత్తనూరు గ్రామ సమీపంలోకి రాగానే 20 మందితో వెళ్తున్న బొలెరో వాహనం సాంకేతిక లోపంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతులు కర్నాటకకు చెందిన ఉప్పరి నాగప్ప (45), జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామానికి చెందిన మనోజ్ (9)గా గుర్తించారు. అయిజ ఎస్సై విజయ్ భాస్కర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.