జగిత్యాల : మల్యాల మండలం రాజారాం గ్రామ శివారులో జగిత్యాల – కరీంనగర్ ప్రధాన రహదారిపై ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇద్దరినీ మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు.
మృతులను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రికి చెందిన వేముల కనకదాస్, జగిత్యాల రూరల్ మండలం టీఆర్నగర్ గ్రామానికి చెందిన ఎస్డీ ఆసిన్గా గుర్తించారు. ఇదే ఘటనలో కనకదాస్ భార్య లావణ్య, మల్యాల మండల కేంద్రానికి చెందిన కత్తి మహేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం ఇద్దరిని కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.