Medaram | ములుగు రూరల్, ఫిబ్రవరి18: ములుగు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ లేక వరుసగా వాహన ప్రమాదాలు జరుగుతున్నా యి. రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. శుక్రవారం జంగాలపల్లి వద్ద కారు ఢీకొట్టి మహిళ మృతి చెందగా, శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన యూటర్న్ వద్ద బస్సు ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందా డు. ప్రతి రెండేండ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు ముందస్తు మొక్కులు చెల్లించేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు వస్తున్నారు.
163వ జాతీయ రహదారి కావడంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాల్లో వస్తున్నారు. అయితే.. జిల్లా కేంద్రంలో ఎక్కడ యూటర్న్లు ఉన్నా యో తెలియక వేగంగా వెళ్తున్నారు. దీంతో యూటర్న్ల వద్ద రోడ్డు దాటే ప్రయత్నం చేసే వారికి ప్రమాదం తప్పడం లేదు. దీనికితోడు డివైడర్ మధ్యలో మొక్కలను ఏర్పాటు చేసి వాటికి రక్షణగా కంచెను నిర్మించారు. ఈ కంచెకు కొందరు వ్యాపారులు, రాజకీయ నేతలు, స్వ చ్ఛంద సంస్థల వారు, ప్రైవేటు కంపెనీల వా రు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వీటి కారణం గా రోడ్డు దాటే వారికి అటుగా వచ్చే వాహనం కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.