రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని మాన్వాడ ఎస్సారార్ (మధ్యమానేరు) రిజర్వాయర్ రెండు గేట్లను శనివారం ఎత్తారు. దిగువకు 4,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 24.19 టీఎంసీల నీరు నిల్వ ఉన్నదని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. యాసంగి పంటల కోసం ఈ నీటిని విడుదల చేసినట్టు వారు పేర్కొన్నారు.
– బోయినపల్లి