జైనథ్(బేల)/కన్నాయిగూడెం, ఫిబ్రవరి 9: పంటలు చేతికి రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఆదిలాబాద్, ములుగు జిల్లాల్లో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పాటన్ గ్రామానికి చెందిన రైతు ఏనుగు లచ్చారెడ్డికి సొంత భూమి రెండున్నర ఎకరాలు ఉండగా, మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. గురువారం రాత్రి కాపలా ఉండేందుకు పొలానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడే రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్కు తరలించారు. లచ్చారెడ్డికి రూ.నాలుగున్నర లక్షల అప్పు ఉన్నట్టు కుటుంబీకులు తెలిపారు. పోలీ సులు కేసు నమోదు చేసుకొ న్నారు.
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గూర్రేవులలో యువ రైతు గురువారం రాత్రి తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. మహాముత్తారం మం డలం లెంకలగడ్డకు చెందిన అగ్గు మధుకర్ (32) గూర్రేవులలో ఎకరం లో మిర్చి సాగు చేస్తున్నాడు. దిగుబడి తగ్గడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు.