కల్లూరు(ఖమ్మం) : పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లిన ఇద్దరు కూలీలు రోడ్డు ప్రమాదం(Road Accident)లో దుర్మరణం చెందారు. ఖమ్మం జిల్లా(Khammam) ఏన్కూరు మండల పరిధిలోని పెట్రోల్బంకు సమీపంలో మంగళవారం ఆటో(Auto), కారు(Car) ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి.
స్థానికులు, పోలీసులు(Police) తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు మండలం అంబేద్కర్నగర్కు చెందిన 14 మంది కూలీలు(Labours) కల్లూరులో ఆటో మాట్లాడుకుని ఏన్కూరులో ఓ రైతు మిర్చి తోట కోసేందుకు బయలుదేరారు. ఏన్కూరు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని ఓ కారు ఓవర్ టేక్(Overtake) చేస్తూ కూలీలతో వెళ్తున్న ఆటోను అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్తో సహా అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయిస్తుండగా వేము వరమ్మ(42), బీరవల్లి వెంకటమ్మ(43) అనే ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందారు.
మేకల సువార్త, వాడపల్లి సంధ్య, ఉబ్బన సుభద్ర, మేకల శాంతమ్మ, బర్రె చారమ్మ, యు.విజయకుమారి, కోట శారద, ఉబ్బన సుజాత, ఉబ్బన రాణి, కాశిమళ్ల కరుణమ్మ, దామాల మంజరి, ఆటోడ్రైవర్ నాగరాజు చికిత్స పొందుతున్నారు. మేకల సువార్త పరిస్థితి తీవ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం(Better Treatment) కోసం హైదరాబాద్ తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (Mla Sandra) ఖమ్మం ఆసుపత్రిలో కూలీల మృతదేహాలను పరిశీలించి, బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై ఏన్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో ఆనందరావు తెలిపారు.