సంగారెడ్డి: అందరి ముందు కట్టుకున్న భార్యలు తీట్టారని ఆత్మహత్య (Suicide) చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులు. సంగారెడ్డి జిల్లాలోని గంజిగూడానికి చెందని లక్షయ్య, వెంకట్పై పలు దొంగతనం ఆరోపణలు ఉన్నాయి. దీంతో వారిని గ్రామస్థులు పంచాయితీకి పిలిచారు. ఈసందర్భంగా గ్రామస్థుల ముందు వారి భార్యలు వారిద్దరిని తిట్టారు. దీంతో మనస్థాపానికి గురైన లక్ష్మయ్య, వెంకట్.. మంగళవారం సాయంత్రం సంగారెడ్డి పాత బస్టాండ్ వద్ద మద్యంలో గడ్డి మందు కలుపుకుని తాగారు. గుర్తించిన స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.