కరీంనగర్: జిల్లాలోని మానకొండూరులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలయ్యారు. బుధవారం వేకువజామున మండల కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఆర్టీ బస్సు ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతులను మానకొండూరులోని బుడిగ జంగాల కాలనీకి చెందిన రాజవ్వ, లచ్చవ్వగా గుర్తించారు. మృత దేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.