కుమ్రం భీం: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో (Kumram Bheem) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రెబ్బన మండలం దేవుళగూడెం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
క్షతగాత్రులను బెల్లంపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతులను తెనుగుగూడకు చెందిన గీత, గణేశ్గా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.