హనుమకొండ : హనుమకొండ(Hanumakonda) జిల్లాలో విషాదం నెలకొంది. చెరువులో( Pond) పడి ఇద్దరు వ్యక్తులు మృతి(Died) చెందారు. ఈ విషాదకర సంఘటన ఐనవోలు మండలం గర్మిళ్లపల్లిలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన అనిల్(28), గోపాల్(11) బావ మరుదులిద్దరు చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. గోపాల్, అనిల్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.