హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ డీసీఎం చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట శివారులో జాతీయ రహదారిపై (NH 65) బ్రేక్డౌన్ అయింది. దీంతో వాహనానికి మెకానిక్ సహా మరో ఇద్దరు మరమ్మతు చేస్తున్నారు. అయితే అదే దారిలో బస్సును ఓవర్టేక్ చేసి వస్తున్న ఓ కంటెయినర్ వారిని ఢీకొట్టింది.
దీంతో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.