వికారాబాద్: వికారాబాద్ మండలంలోని గొట్టుముక్కల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున గొట్టుముక్కల సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతులను పరిగి మండలం నస్కల్కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.