సూర్యాపేట: సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తాడ్వాయిలో వేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి బర్రెలను గుద్దింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డరు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులను కలకోవకు చెందిన రఘు, నరహరిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.