వరంగల్: ఖిలావరంగల్ (Khila Warangal) మండలం నాయుడు పెట్రోల్ పంపు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను ఇల్లంద గ్రామానికి చెందిన సుధాకర్, వర్ధన్నపేటకు చెందిన గణేశ్గా గుర్తించారు. వివాహ విందు కోసం బైక్పై కూరగాయలు తీసుకొస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.