హైదరాబాద్ : రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఉందని, సముద్రమట్టానికి సమారు. 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని పేర్కొంది. తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపునకు వస్తున్న గాలులు వస్తున్నాయని చెప్పింది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో శనివారం పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.