వనపర్తి: జిల్లాలోని కొత్తకోట (kothakota) మండలం కడకండ్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కడకండ్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులను పెబ్బేరు మండలం శాగాపురం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.