దవాఖానను తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మహబూబ్నగర్ మే 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): మహబూబ్నగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో కొవిడ్ చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఓ రోగి బంధువులు ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ మహబూబ్నగర్లో పరిస్థితిని సమీక్షించాలని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్, కలెక్టర్కు ట్విట్టర్ ద్వారా సమాచారమిచ్చారు. వెంటనే మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ చేరుకుని దవాఖానలో వైద్యం అందుతున్న తీరు, ఫీజుల వసూళ్లపై రోగుల బంధువులతో మాట్లాడారు. అన్ని ప్రైవేట్ దవాఖానల్లో 20 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, వీటిని పేదలకు వైద్యం అందించేందుకు వినియోగిస్తామని తెలిపారు. రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.