హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది జనవరి 8 నుంచి హైదరాబాద్లో నిర్వహించే ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ప్లీనరీకి హాజరు కావాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావును టీయూడబ్ల్యూజే నేతలు ఆహ్వానించారు. అంబేదర్ వర్సిటీలో శనివారం జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి కేటీఆర్ను నేతలు ప్రత్యేకంగా కలిశారు. జర్నలిస్టుల సమస్యలతోపాటు పెండింగ్లో ఉన్న చిన్న పత్రికల గ్రేడింగ్ తదితర సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. మంత్రిని కలిసినవారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణకుమార్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు