మెట్పల్లి, ఫిబ్రవరి 15: జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో గురువారం రికార్డు ధర లభించింది. పసుపు కాడి (కొమ్ము) క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.12,559, కనిష్ఠ ధర రూ.4,059 పలికింది. కాగా పసుపు గోళ (మండ) క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.11,111, కనిష్ఠ ధర 6,565 వచ్చింది. క్రయ, విక్రయాలు ప్రారంభమైన మొదటిరోజు మార్కెట్లో 285 క్విం టాళ్లు, రెండో రోజైన గురువారం 203 క్వింటాళ్ల కొనుగోళ్లు జరిగాయి.