మెట్పల్లి, ఫిబ్రవరి19: జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో సోమవారం పసుపు క్వింటాల్కు గరిష్ఠ ధర రూ.13,006 పలికింది. మార్కెట్లో పసుపు క్రయ, విక్రయాలు జోరుగా సాగాయి. పసుపు కాడి (కొమ్ము)కి క్వింటాల్కు గరిష్ఠంగా రూ.13,006, కనిష్ఠంగా రూ.5,112, పసుపు గోళ (మండ) క్వింటాల్కు గరిష్ఠంగా రూ.11,316, కనిష్ఠంగా రూ.4,012, పసుపు చూర క్వింటాల్కు గరిష్ఠంగా రూ.10,122, కనిష్ఠంగా రూ.8,666 పలికింది.
పసుపు కాడికి గరిష్ఠంగా రూ.13,006 ధర పలకడం ఈ సీజన్లో ఇదే తొలిసారి. ఇప్పటి వరకు మార్కెట్లో 1082 క్వింటాళ్ల పసుపు క్రయవిక్రయాలు జరిగినట్టు మార్కెట్ కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తెలిపారు.