నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై (MP Aravind )పసుపు రైతులు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ మండలం పెర్కిట్లోని ఆయన ఇంటి ముందు పసుపు పంట పోసి నిరసనకు దిగారు. ఓట్ల కోసం అరవింద్ తమ మనోభావాలతో ఆడుకున్నాడని పసుపు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన ఎక్కడ పర్యటించినా అడ్డుకుని తీరుతామని రైతులు స్పష్టం చేశారు.