హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణకు రెండో పీఆర్సీ కమిటీని ఏర్పాటుచేయాలని, ఐఆర్ను ప్రకటించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్రెడ్డి శనివారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్కు వినతిపత్రం అందజేశారు.