TTD | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ఒక్కరైనా దర్శించుకుని తరించాలని భక్తులు అనుకుంటారు. భక్తుల కొంగుబంగారమైన ఆ శ్రీనివాసుడికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సేవా చేసుకోవాలని కోరుకునేవారు చాలామంది ఉంటారు. అలాంటివారి కోసం టీటీడీ వర్చువల్ సేవా టికెట్లను నేడు విడుదల చేయనుంది. మార్చి నెల కోటాకు సంబంధించిన ఈ టికెట్లను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది. ఇందులోభాగంగా కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవా టికెట్లు, సంబంధిత దర్శన టికెట్లను విడుదల చేస్తుంది.
అదేవిధంగా మార్చి నెలకుగాను రూ.300 టికెట్ల ఆన్లైన్ కోటాను విడుదల చేయనుంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుంది. ఇక ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లను మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేస్తుంది.