హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): భక్తుల సౌకర్యార్థం టీటీడీ కొత్తగా రూపొందించిన టీటీ దేవస్థానమ్స్ యాప్ను సంస్థ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. గోవింద యాప్లో సమస్యలు వస్తుండటంతో దీనిని తీసుకొచ్చారు. ఇటీవల ప్రయోగం చేయగా, విజయవంతం అయ్యిందని చెప్పారు.
ఈ యాప్ ద్వారా సులభంగా దర్శనం, గదులు, శ్రీవారి సేవా టికెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. సుప్రభాతం, తోమాల, అర్చన వంటి సేవలను వినేందుకు వీలుగా యాప్లో పొందుపర్చినట్టు వివరించారు. గోవింద యాప్ను కలిగి ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ‘టీటీ దేవస్థానమ్స్’ను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. కొత్తయాప్ ద్వారా ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారాలు కూడా వీక్షించవచ్చని వెల్లడించారు.