హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): లోక కల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాద నీరాజనం వేదికపై ఆదివారం ఉదయం జరిగిన 6వ విడత అయోధ్య కాండ అఖండ పారాయణం భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తింది.
ఉదయం 7 నుంచి 9 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయోధ్యకాండలోని 18 నుంచి 21వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 199 శ్లోకాలు, యోగ వాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 224 శ్లోకాలను పారాయణం చేశారు.