హైదరాబాద్, జనవరి 12 : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మైదానాల్లోనే పతంగులు ఎగురవేయాలని టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యుత్తు లైన్లు, ట్రాన్స్ఫార్మర్లకు దూరంగా ఎగురవేయాలని, తడి ప్రదేశాలలో ఎగురవేయవద్దని వెల్లడించారు. విద్యుత్తు వైర్లు, పరికరాలపై పతంగులు, మాంజాలు తెగిపడితే వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. వెంటనే విద్యుత్తు శాఖ 1912 నంబర్కు తెలియజేయాలని, లేదా సమీప విద్యుత్తు కార్యాలయానికి సమాచారం అందించాలని కోరారు. www.tssouthernpower.com వెబ్సైట్ ద్వారా కూడా విషయాన్ని తెలియజేయవచ్చని పేర్కొన్నారు.