కీసర, ఫిబ్రవరి 28: లంచం తీసుకుంటూ మేడ్చల్ జిల్లా కీసర విద్యుత్తు ఏఈ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. కీసర మండలం చీర్యాల్లో కాంట్రాక్టర్ బాల్నర్సింహ 63 కేవీ విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ బిగించాడు. ఈ ట్రాన్స్ఫార్మర్ పనితీరును పరిశీలించి ఆర్డర్ ఇవ్వడానికి కీసర ఏఈ అనిల్కుమార్ సదరు కాంట్రాక్టర్ను రూ.15 వేలు లంచం డిమాండ్ చేయ గా, చివరకు రూ.12 వేలకు బేరం కుదిరింది.
మంగళవారం కీసరలోని విద్యు త్తు కార్యాలయంలో బాల్నర్సింహ నుంచి ఏఈ అనిల్ రూ.12 వేలు లం చం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి తన బృందంతో కలిసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏఈని అదుపులోకి తీసుకొని 2 గంటలపాటు విచారించారు. అతని ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు.