హైదరాబాద్: తెలుగు నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆర్టీసీ (RTC) సీనియర్ సిటిజన్లకు శుభవార్త అందించింది. 65 ఏండ్లు నిండిన వారు శనివారం రోజంతా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే బస్సుల్లో ప్రయాణించేటప్పుడు సీనియర్ సిటిజన్లు తమకు సంబంధించిన గుర్తింపు కార్డు చూపించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
దీంతోపాటు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ఆర్టీసీ కార్గోలో 5 కిలోల బరువున్న పార్సిల్ను బుక్ చేసుకుంటే 25 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అదేవిధంగా శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సుల్లో అప్ అండ్ డౌన్ టికెట్పై 10 రోజుల్లోపు తిరుగు ప్రయాణ ఛార్జీల్లో 25 శాతం రాయితీ ప్రకటించింది.