హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): గ్రామీణ, పట్టణ ప్రయాణికులపై ఆర్థికభారం తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ‘టీ-9 టికెట్’ సమయాల్లో టీఎస్ ఆర్టీసీ మార్పులు చేసింది. ఈ టికెట్.. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వర్తిస్తుందని ప్రకటించింది. గతంలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకే చెల్లుబాటు అయ్యేది.
ఆ టికెట్తో ఎక్స్ప్రెస్ల్లో ప్రయాణించే వెసలుబాటును కల్పించింది. రూ.100 చెల్లించి కొనుగోలు చేసే టికెట్పై తిరుగు ప్రయాణంలో రూ.20 కాంబీ టికెట్తో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చని తెలిపింది. ఇది ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. టికెట్లను మహిళలు, సీనియర్ సిటిజన్స్ వినియోగించుకోవాలని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్సెంటర్ 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.