హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కండక్టర్ కుటుంబానికి ఆర్టీసీ అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) సహకారంతో రూ.40 లక్షల ఆర్థికసాయం అందజేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో మెదక్ డిపో కండక్టర్ సీహెచ్ అంజ య్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందా రు. విధులు ముగించుకుని స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై అంజయ్య మృతిచెందారు. ఇంటిపెద్ద మృతితో బాధిత కుటుంబంలో విషాదం అలుముకున్నది.
ఈ ఆపద సమయంలో యూబీఐ సూపర్శాల రీసేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాన్ని ఆదుకున్నది. ఇటీవల ఉద్యోగుల సాలరీ అకౌంట్స్ను ఆర్టీసీ యాజమాన్యం యూబీఐకి మార్చింది. ఈ ఖాతా ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉన్నది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40 లక్షల వరకు అందజేస్తున్నది. హైదరాబాద్ బస్భవన్లో మంగళవారం అంజయ్య కుటుంబానికి రూ.40 లక్షల విలువైన చెకు ను యూబీఐ అధికారులతో కలి సి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అందజేశా రు. అంజయ్య భార్య మణెమ్మ, కుమారుడు సంతోష్ కుమార్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సం స్థ సీవోవో డాక్టర్ వీ రవీందర్, ఈడీలు ఎస్ కృష్ణకాంత్, పీవీ మునిశేఖర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.