హైదరాబాద్ : కాచిగూడ ఆర్టీసీ బస్టాండ్లో మెడికల్ షాపును టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆదాయం పెంచే చర్యలు చేపట్టామని తెలిపారు. సొంత భవనాల ద్వారా ఆదాయం సమకూర్చుకుంటామని చెప్పారు.
ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని బస్టాండ్లలో ఫార్మసీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సీబీఎస్, కాచిగూడ బస్టాండ్లలో మెడికల్ షాపులను ఏర్పాటు చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో అన్ని డిపోల్లో మెడికల్ షాపులతో పాటు ఆస్పత్రుల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు గోవర్ధన్ పేర్కొన్నారు.