హైదరాబాద్, ఫిబ్రవరి 11(నమస్తే తెలంగాణ) : వైద్య కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత తీర్చాలని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల అసోసియేషన్(టీఎస్ఆర్డీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని కోఠి హెల్త్ క్యాంపస్లో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నరేంద్రకుమార్కు టీఎస్ఆర్డీఏ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ వైద్య కాలేజీల్లో ఇటీవల తమ సర్వేలో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉన్నట్టు తేలిందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డీ శ్రీనాథ్ తెలిపారు. అనేక విభాగాలు కేవలం ఒకే అసిస్టెంట్ ప్రొఫెసర్తో నడుస్తున్నట్టు వివరించారు.
పెరిఫెరల్, జిల్లా వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరత కారణంగా ఉన్న ఫ్యాకల్టీపై తీవ్ర పని భారం పడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులపై పూర్తిగా ఆధారపడకుండా పూర్తిస్థాయి సిబ్బంది నియామకానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని డీఎంఈని కోరినట్టు తెలిపారు. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని డీఎంఈ హామీ ఇచ్చినట్టు ఆయన చెప్పారు. పెరిఫెరల్ వైద్య కళాశాలల్లో అధ్యాపకులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ కోసం చర్యలు చేపడుతామని భరోసా ఇచ్చినట్టు