హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల రాత పరీక్షను రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ప్రకటించారు. టీఎస్పీఎస్సీలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్కుమార్, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి కలిసి కంప్యూటర్ను హ్యాక్ చేసి అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడినట్టు తేలింది. ఈ విషయమై ఈ నెల 14న ఎఫ్ఐఆర్ 95/2023 నంబర్పై కేసు నమోదైందని, అందుకే పరీక్షను రద్దు చేస్తున్నట్టు సెక్రటరీ పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ ఏఈ పరీక్షను నిర్వహించేందుకు తదుపరి తేదీని ప్రకటిస్తామని తెలిపారు. 833 ఉద్యోగాలకు గతేడాది సెప్టెంబర్ 12న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. 5న జరిగిన పరీక్షకు 55,189 మంది హాజరయ్యారు. కంప్యూటర్లు హ్యాకింగ్కు గురైనట్టు తెలియడంతో ఈ నెల 12న జరుగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ (టీపీబీవో), 15, 16 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను రద్దు చేస్తున్నట్టు కమిషన్ శనివారమే ప్రకటించింది. ఉద్యోగార్ధులు అందరికీ వెంటనే దరఖాస్తులో సూచించిన సెల్నం బర్కు మెసేజ్ ద్వారా టీఎస్పీఎస్సీ సమాచారం అందించింది.
అసలేం జరిగిందంటే
టీఎస్పీఎస్సీలో పులిదిండి ప్రవీణ్కుమార్ అసిస్టెంట్ సెక్షన్ అఫీసర్గా పనిచేస్తున్నాడు. మ హబూబ్నగర్ జిల్లా పగిడ్యాల్ పంచంగల్ తం డాకు చెందిన గురుకుల టీచర్ రేణుక, ఆమె భర్త వికారాబాద్ జిల్లా డీఆర్డీవో టెక్నికల్ అసిస్టెంట్ లావడ్యవత్ ఢాక్యతో ముందు నుంచే ప్రవీణ్కు పరిచయం ఉన్నది. తన తమ్ముడి కో సం ఏఈ ప్రశ్నపత్రం కావాలని ప్రవీణ్ను రేణు క సంప్రదించింది. ప్రవీణ్.. సిస్టమ్ అడ్మిన్ రా జశేఖర్రెడ్డి సహాయంతో ప్రశ్నపత్రం దొంగిలిం చి రేణుకకు ఇచ్చాడు. ప్రవీణ్కు ఆమె రూ.10 లక్షలు ఇచ్చింది. ఆమె 13.50 లక్షలు తీసుకొని ఆ ప్రశ్నపత్రాన్ని మరో ఇద్దరికి పంపింది.