హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా వచ్చే నెల న గ్రూప్-4 ఉద్యోగ (Group-4) నియామక పరీక్షను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన హాల్టికెట్లు (Hall Tickets) శనివారం నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉండనున్నాయి. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందు వరకు ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి.
జూలై 1వ తేదీన రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుందని టీఎస్పీఎస్సీ (TSPSC) అధికారులు సూచించారు.