హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఫైనల్ కీ మంగళవారం విడుదల కానున్నట్టు తెలిసింది. అక్టోబర్ 29న ప్రాథమిక కీని విడుదల చేసిన టీఎస్పీఎస్సీ అభ్యంతరాలను స్వీకరించింది.
అయితే అభ్యర్థుల నుంచి కమిషన్కు పలు అభ్యంతరాలు రావడంతో సోమవారం నిపుణుల కమిటీ తుది సమావేశం జరగనున్నదని సమాచారం. టీఎస్పీఎస్సీ 503 గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయగా.. 2,86,051 మంది ప్రిలిమినరీ పరీక్ష రాశారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్కు ఎంపిక చేస్తారు.