హైదరాబాద్ : గ్రూప్-1 పోస్టుల భర్తీలో భాగంగా టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రిలిమ్స్ను అక్టోబర్ 16న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మంగళవారం టీఎస్పీఎస్సీ పాలకవర్గం సమావేశమై ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ తేదీని ఖరారు చేసింది. అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రాథమిక పరీక్షను నిర్వహించనుండగా.. మెయిన్స్ను జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
వాస్తవానికి మొదట ప్రిలిమ్స్ పరీక్షను జూలై లేదా ఆగస్ట్లో నిర్వహించాలని నిర్ణయించామని, అభ్యర్థుల సూచన మేరకు విజ్ఞప్తుల మేరకు ప్రిలిమ్స్ను అక్టోబర్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించాలని కమిషన్ నిర్ణయించిందని, పరీక్ష కేంద్రాల వివరాలు, హాల్ టికెట్ నిర్ణీత సమయంలో టీఎస్పీఎస్సీ వైబ్సైట్ www.tspsc.gov.inలో అప్డేట్ చేయనున్నట్లు వివరించింది. 503 పోస్టులకు ఈ ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గ్రూప్-1 పోస్టులకు 3,80,202 దరఖాస్తులు వచ్చాయని టీఎస్పీఎస్సీ తెలిపింది.