హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : వివిధ ఉద్యోగాల పరీక్షల ఫలితాలను తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి బుధవారం తెలిపారు. త్వరలోనే ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతామని, అందుకోసం అభ్యర్థులంతా సిద్ధంగా ఉండాలని సూచించారు.
కమ్యూనిటీ, ఈడబ్ల్యూఎస్, బీసీలకు నాన్-క్రీమీలేయర్, స్టడీ/రెసిడెన్సీ, రిజర్వేషన్ ైక్లెమింగ్తోపాటు విద్యార్హతలు వంటి వాటి ఆధారాలు (ధృవీకరణ పత్రాలు)కూడా సిద్ధం చేసుకోవాలని తెలిపారు.