హైదరాబాద్, డిసెంబర్7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఈ నెల 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
మొత్తం 19 సబ్జెక్టుల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తామని బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నది. వివరాలకు కమిషన్ వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.