TSPSC | హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు చివరిదశకు చేరుకున్నది. ఇప్పటికే ప్రాథమిక చార్జిషీట్ దాఖలు చేసిన సిట్.. త్వరలో పూర్తిస్థాయి చార్జిషీట్ కోర్టులో సమర్పించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటి వరకు 91 మంది అరెస్టు కాగా, మరో 15-20 మందిని అరెస్టు చేయాల్సి ఉన్నది. ఈ కేసులో మాజీ ఏఈ పోల రమేశ్ నెట్వర్క్లో మాస్ కాపీయింగ్, లీకైన పేపర్ విక్రయాలతో పరీక్ష రాసిన వారందరిని సిట్ గుర్తించింది.
శాస్త్రీయ ఆధారాలు, బ్యాంకు ఖాతాలు, సెల్ఫోన్ కాల్ డాటా, పరీక్ష రాసిన కేంద్రాలు, పరీక్షకు సిద్ధమైన ప్రాంతాలు తదితర అంశాలన్నింటి వివరాలు సేకరించారు. నిందితుల నుంచి సేకరించిన ఫోన్లు, ల్యాప్టాప్, కంప్యూటర్లను సిట్ ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఫోరెన్సిక్ నివేదికలు కూడా త్వరగా సేకరించి, ఫైనల్ చార్జిషీట్ వేసేందుకు సిట్ కసరత్తు ముమ్మరం చేస్తున్నది.