నాంపల్లి కోర్టులు, మే 1 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్టయిన కొడుకు కేవీ జనార్దన్ (ఏ19), తండ్రి కోస్గి మైబయ్య (ఏ20) మూడు రోజుల కస్టడీ సోమవారం పూర్తికావడంతో సిట్ అధికారులు 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
ప్రశ్నపత్రం కొనుగోలు కేసులో తండ్రీకొడుకుపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. విచారణ నిమిత్తం సిట్ పీపీ వేసిన పిటిషన్ అధారంగా మూడురోజుల కస్టడీకి కోర్టు అప్పగించింది. సిట్ అధికారులు పలు విషయాల గురించి వీరిని ప్రశ్నించారు. మరోవైపు ఈడీ పీపీ వేసిన ఐదుగురి కస్టడీ పిటిషన్ తీర్పును మెజిస్ట్రేట్ వాయిదా వేశారు.