AEE Recruitment | సుల్తాన్బజార్, ఫిబ్రవరి 24: లోక్సభ ఎన్నికల కోడ్ రాకముందే తమ నియామకాలు చేపట్టాలని ఏఈఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘హలో నిరుద్యోగి, చలో గాంధీభవన్’ పేరిట శనివారం నిర్వహించిన ఆందోళనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గాంధీభవన్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డికి వినతిపత్రాన్ని అందించారు.
అనంతరం వారు మా ట్లాడుతూ ఉద్యోగ పరీక్ష ఫలితాలు వచ్చి ఆరునెలలు గడుస్తున్నా టీఎస్పీఎస్సీ అధికారులు వెరిఫికేషన్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. సుమారు 1,540 మంది ఎంపికై ఆరు నెలలు గడుస్తున్నా పోస్టింగ్లు ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు పోస్టింగ్లు ఇచ్చి తమకు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ, కోర్టు కేసుల పేరిట కాలయాపన జరిగిందని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి తమకు నియామకపత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్తానన్న భవానీరెడ్డి హామీతో అభ్యర్థులు ఆందోళనను విరమించారు.