హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. మొన్న గ్రూప్-4 నోటిఫికేషన్(9,168 ఉద్యోగాలు), నిన్న మెడికల్ ఎడ్యుకేషన్లో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగా, తాజాగా పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ల పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం 19 సబ్జెక్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 14 నుంచి జనవరి 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తదితర వివరాల కోసం www.tspsc.gov.in వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.