హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) పరీక్షను మంగళవారం పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పేపర్2 పరీక్ష సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహిస్తారు.
అభ్యర్థులు తప్పనిసరిగా రెండు పేపర్లు రాస్తేనే పరిగణనలోకి తీసుకొంటామని పేర్కొన్నది. రాష్ట్రంలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నిరుడు డిసెంబర్ 28న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. తొలుత ఏప్రిల్ 25న పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రకటించింది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షను మే 16కు వాయిదా వేసింది.