ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చిన తర్వాత 24 నుంచి 48 గంటల్లో ఆయా శాఖల హెచ్వోడీలతో సమీక్ష నిర్వహిస్తున్నాం. వారం నుంచి మూడు వారాల్లోనే నోటిఫికేషన్లు ఇస్తున్నాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అన్నింటినీ ఒకటికి రెండుసార్లు పునః పరిశీలించిన తర్వాతే నోటిఫికేషన్లు ఇస్తున్నాం. నిబంధనలన్నీ పటిష్ఠంగా అమలు చేస్తున్నాం.
అభ్యర్థులకు నిత్యం అందుబాటులో ఉంటున్నాం. నోటిఫికేషన్కు ముందే అభ్యర్థుల సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నాం. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నాం. గ్రూప్- 2, గ్రూప్- 3 పోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో వెంటనే ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించాం. వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు ఇస్తాం.
– జనార్దన్రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్