TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ 563 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. 23న ఉదయం 10 గంటలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి 14వ తేదీన సాయంత్రం 5 గంటలకు దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. మార్చి 23 నుంచి 27వ తేదీ వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే/జూన్ 2024లో ప్రిలిమినరీ, సెప్టెంబర్/అక్టోబర్ 2024లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
-గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేయాల్సిందే. అయితే వీరు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్లైన్లో ఎమ్మార్ లేదా.. ఆన్లైన్లో కంప్యూటర్బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహిస్తారు. దీనిపై పూర్తి నిర్ణయాధికారం టీఎస్పీఎస్సీదే. ఆన్లైన్లో నిర్వహిస్తే నార్మలైజేషన్ చేస్తారు.
-మెయిన్స్ పరీక్ష వ్యాసరూపంగా ఉంటుంది. డిజిటల్ ప్రశ్నపత్రం లేదా.. ముద్రిత ప్రశ్నపత్రాన్నిస్తారు. ఈ పరీక్షలను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తారు.
-గరిష్ట వయోపరిమితిని 46ఏండ్లు పెంచారు. కొన్ని పోస్టులకు కనిష్ట వయోపరిమితి 18 ఏండ్లు, కొన్నింటింకి 21 ఏండ్లుగా ఉంది.
-ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గరిష్టంగా ఐదేండ్లు, మాజీ సైనికులకు మూడేండ్లు, ఎన్సీసీ వారికి మూడు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు, వికలాంగులకు పదేండ్ల వయోపరిమితి సడలింపునిచ్చారు.
-దరఖాస్తు చేసే వారు పరీక్ష ఫీజుగా రూ. 120లను ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది.
-ఓఎమ్మార్ ప్రిలిమ్స్ పరీక్షను రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు ఏదేనీ 10 జిల్లాలను ఎంచుకోవాలి. కంప్యూటర్బేస్ట్ టెస్ట్ అయితే 10 ఉమ్మడి జిల్లాకేంద్రాల్లో నిర్వహిస్తారు.
-మెయిన్స్ పరీక్షను హైదరాబాద్ ( హెచ్ఎండీఏ) పరిధిలోని నిర్వహిస్తారు. అవసరమైతే ఇతర జిల్లాల్లోను నిర్వహించే అవకాశముంది.
-ప్రిలిమ్స్ను 150 మార్కులకు, మెయిన్స్ను 900 మార్కులకు నిర్వహిస్తారు.