వన్టైం రిజిస్ట్రేషన్ ఫాం (ఓటీఆర్)లో మార్పులకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్పీఎస్పీ ప్రకటించింది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను సంప్రదించి, ఓటీఆర్లో ఎడిట్ ఆప్షన్ను ఎంచుకొని, కొత్త స్థానికత, విద్యార్హతలను మార్చుకొనే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఆదివారం ప్రెస్నోట్ విడుదల చేసింది.
రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం.. రాష్ట్రంలో జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్ల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో స్థానికత అర్హతలను సైతం తెలంగాణ ప్రభుత్వం మార్చింది. ఇది వరకు 4 నుంచి 10 తరగతుల వరకు 4 ఏండ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లాలో స్థానికుడిగా పరిగణించేవారు. ఇప్పుడు 1 నుంచి 7 తరగతుల్లో చివరి 4 ఏండ్లు ఏ జిల్లా, జోన్, మల్టీ జోన్లో చదివితే ఆ జిల్లా, జోన్, మల్టీ జోన్లలో స్థానికుడిగా పరిగణిస్తామని తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నది. ఈ లెక్కన టీఎస్పీఎస్సీ ఓటీఆర్లో మార్పులు చేసింది.
ఓటీఆర్లో మార్పు కోసం అభ్యర్థులు www.tspsc.gov.in ను సంప్రదించాలి. ఓటీఆర్ ఫామ్ తెరిచి లాగిన్ ఐడీ, పుట్టిన తేదీ ఆధారంగా లాగిన్ కావాలి. అనంతరం స్థానికత అర్హతలను అప్డేట్ చేసుకోవాలి. 33 జిల్లాల ఆధారంగా ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఎక్కడ చదివారనేది అప్డేట్ చేసుకోవాలి. ఓటీఆర్ ఫాం కాలమ్స్లో లేటెస్ట్ క్వాలిఫికేషన్స్లాంటి వేరే ఏ మార్పులైనా చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ తెలిపింది.