హైదరాబాద్ : టీఎస్ పీఈసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆలస్య రుసుము లేకుండా ఆగస్టు 13 వరకు ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం పీఈసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కరోనా పరిస్థితుల కారణంగా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తుకు గడువు పెంచాలని సెట్ చైర్మన్ను కోరారు. ఈ మేరకు గడువు పెంచేందుకు ఆయన సుముఖతం వ్యక్తం చేశారని టీఎస్ పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు.