హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ ప్రక్రియ గడువును మరోసారి పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గడువు ఆగస్టు 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతిలో అందరినీ పాస్ చేయడం వల్ల ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్లో ఎక్కువ మంది చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.