హైదరాబాద్ : తెలంగాణ ఎన్పీడీసీఎల్లో పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేశారని వస్తున్న వార్తలపై సీఎండీ గోపాల్రావు స్పందించారు. ఉద్యోగాల నోటిఫికేషన్ వార్తలపై ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు వివరణ ఇచ్చారు. ఎన్పీడీసీఎల్లో పోస్టుల భర్తీకి ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు.
157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.. ఆ వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. ఆడిట్ కోసం చార్టెర్డ్ అకౌంటెంట్ సంస్థల సేవల కోసం ప్రకటన ఇచ్చామని తెలిపారు. 157 ఆడిట్ యూనిట్లను 157 పోస్టులుగా వక్రీకరించారు. తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మొద్దు. సంస్థ వెబ్సైట్ చూసి నిర్ధారించుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు సూచించారు.